బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ (Ramayana) పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్న ఈ ఇతిహాస చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ‘రామాయణ’ ట్రైలర్ అన్ని సోషల్ మీడియా వేదికలను కలిపి ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సాధించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్తో పాటు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా ట్రైలర్కు భారీ స్పందన రావడంతో ఈ మైలురాయి నమోదు అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రికార్డు చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి. విజువల్స్, గ్రాండియర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తుండగా, నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.






