కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic), ఆ తర్వాత ప్రతిష్టాత్మక ‘రామాయణ’ విడుదల కానుంది. అయితే ఒకప్పుడు భారీ అంచనాలు నెలకొల్పిన ‘టాక్సిక్’పై ప్రస్తుతం అదే స్థాయిలో హైప్ కనిపించడం లేదు.
ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. దీంతో సినిమాపై ఉన్న ప్రారంభ ఉత్సాహం కూడా క్రమంగా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి మళ్లీ బజ్ తీసుకురావాల్సిన బాధ్యత ట్రైలర్పైనే ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆగస్టు 8న బెంగళూరులో ‘టాక్సిక్’ ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తుండగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తోంది.






