వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తి (karthi), ఇప్పుడు స్టార్ దర్శకుడు మోహన్ రాజాతో జతకట్టనున్నాడనే వార్త కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ‘తని ఒరువన్’, ‘గాడ్ ఫాదర్’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహన్ రాజా దర్శకత్వంలో కార్తి నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, స్ఫూర్తిదాయకమైన హీరోయిజం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తి పాత్ర పూర్తిగా కొత్త కోణంలో ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తి ‘సర్దార్ 2’ (Sardar 2) షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ కొత్త ప్రాజెక్ట్కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం సహా ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.






