కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ పై Toxic విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, నయనతార కీలక పాత్రల్లో నటించారు. భారీ హైప్ మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ను సొంతం చేసుకున్నప్పటికీ, విడుదల తర్వాత వచ్చిన నెగెటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచినట్లు వార్తలు వచ్చాయి.
ఇక ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా భారీ సినిమాలకు విడుదలకు ముందే ఓటీటీ ఒప్పందాలు పూర్తవుతాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో ఎలాంటి ఓటీటీ డీల్ను పూర్తి చేయకుండానే సినిమాను థియేటర్లలో విడుదల చేసినట్లు సమాచారం.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. సినిమా విడుదలకు ముందు ఓటీటీ సంస్థ నుంచి రూ.150 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు అదే డీల్ విలువ భారీగా తగ్గిపోయిందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కేవలం రూ.30 కోట్లకు ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.
ఇదిలా ఉంటే, ‘టాక్సిక్’ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్కు చెందిన మరో భారీ చిత్రం ‘జన నాయగన్’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. దళపతి విజయ్ నటించిన ఈ సినిమాకు విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి రూ.100 కోట్లకు పైగా డీల్ కుదిరినట్లు ప్రచారం జరిగింది.
అయితే సినిమా విడుదలలో చోటుచేసుకున్న వరుస జాప్యాలు, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ డీల్ నుంచి ఓటీటీ సంస్థ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీ హక్కులు తక్కువ మొత్తానికి మరో ప్లాట్ఫామ్కు వెళ్లినట్లు సమాచారం.
ఇప్పుడు ‘టాక్సిక్’ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఎదురైందనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరు? అసలు డీల్ ఎంతకు కుదిరింది? రూ.150 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పడిపోయిందనే వార్తల్లో నిజమెంత? అనే విషయాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




