టాలీవుడ్లో కొంతకాలంగా కొనసాగుతున్న ‘పర్సెంటేజ్ వార్’ ఇప్పుడు తీవ్రమైన దశకు చేరింది. వ్యాపార పరమైన విభేదాలుగా మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది (Peddi) విడుదలకే ముప్పుగా మారడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క స్క్రీన్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించబోమని తీసుకున్న నిర్ణయం, భారీ బ్లాక్బస్టర్ను విడుదలకే ముందే దెబ్బతీసే పరిస్థితిని సృష్టిస్తోంది.
తమ డిమాండ్లను నెరవేర్చించుకోవడానికి ఒక పెద్ద సినిమాను ఆయుధంగా మార్చుకోవడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. నిర్మాతలతో జరుగుతున్న ఈ పోరులో అభిమానులు, చిత్ర బృందమే బలిపశువులవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. నైజాం ప్రాంతంలో పూర్తిస్థాయి బహిష్కరణ అమలైతే, నిర్మాతలకే కాకుండా ఇప్పటికే కష్టాల్లో ఉన్న థియేటర్ల మనుగడకూ భారీ దెబ్బ పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమ పంతాల కోసం ఒక సినిమా భవిష్యత్తునే పణంగా పెట్టడం టాలీవుడ్కు మంచిపేరు తీసుకురాదని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. జూన్ 4 లోపు ఈ వివాదానికి సామరస్యపూర్వక పరిష్కారం దొరకకపోతే, ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక చేదు అధ్యాయంగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ ఈగో పోరాటంలో చివరికి ఎవరు గెలుస్తారో కాలమే తేల్చాలి.
