గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ Peddi ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. గ్రామీణ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న జాన్వీ కపూర్ ప్రమోషనల్ ఈవెంట్స్కు దూరంగా ఉండబోతున్నారనే ప్రచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఆమె పాత్రకు పరిమిత ప్రాధాన్యం మాత్రమే ఉంటుందనే కారణంతోనే ఆమె ప్రమోషన్స్లో పెద్దగా కనిపించకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక జాన్వీ కపూర్కు ఇది తెలుగులో కీలకమైన సినిమా అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆమెకు ‘పెద్ది’ హిట్ అయితే మరిన్ని భారీ అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రమోషన్స్కు దూరంగా ఉండటం ఆమె కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్లు సమాచారం. సంగీతాన్ని ఏ.ఆర్. రెహ్మాన్ అందిస్తుండగా, విజువల్స్ కూడా గ్రాండ్గా ఉండబోతున్నాయని టాక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు నడుస్తున్న వేళ, ఇప్పుడు జాన్వీ కపూర్ ప్రమోషన్స్ అంశం మరో కొత్త చర్చకు దారి తీసింది. రిలీజ్ దగ్గరపడే కొద్దీ ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
