ఓటీటీ ప్రేక్షకులకు మరో అప్డేట్. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ అవకాశం ముందుగా కొంతమందికే అందింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ aha లో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తెరకెక్కిన రూరల్ ఎంటర్టైనర్ తిమ్మరాజుపల్లి టీవీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ చిత్రం డీసెంట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద నిలబడింది. వి. మునిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులు వెండితెరకు పరిచయమయ్యారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మే 14 నుంచే ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్కు ఎక్స్క్లూజివ్గా అందుబాటులోకి వచ్చింది. దీంతో గోల్డ్ యూజర్లు మిగతా ప్రేక్షకుల కంటే ఒక రోజు ముందుగానే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందారు. సాధారణ సబ్స్క్రైబర్లు మాత్రం మే 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆహాలో ఈ సినిమాను స్ట్రీమ్ చేయవచ్చు.
గ్రామీణ నేపథ్యంతో, కొత్త ముఖాలు మరియు సహజమైన కథనంతో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది మంచి వార్తే. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
వైవిధ్యమైన కథలను ఇష్టపడే వారు, ఈ వారాంతంలో ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. గ్రామీణ వాతావరణం, కొత్త నటులు, సింపుల్ ఎమోషన్స్ కలిసి ఓటీటీలో కొత్త అనుభూతిని అందిస్తాయేమో చూడాలి.
