దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అత్యంత అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్లుగా నిలుస్తున్నాయి. ప్రభాస్తో రాబోతున్న సలార్ 2 పట్ల భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో, దానికి ముందే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్తో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న నీల్ నుండి ఇప్పుడు ఒక మైండ్ బ్లాకింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.
పృథ్వీరాజ్ లీక్ గుర్తుందా?
2024లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంట్రెస్టింగ్ లీక్ అందించారు. ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన కథలన్నీ తనకు తెలుసని, వాటిలో తన శివ్ మన్నార్ పాత్ర క్రాసోవర్తో మరో సినిమా కూడా ఉంటుందని పృథ్వీరాజ్ అప్పట్లో చెప్పారు.
వైరల్ ఫోటోల్లో కనెక్షన్
తాజాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుండి వైరల్ అయిన కొన్ని ఫోటోలు అభిమానుల్లో సంచలనం రేపాయి. ఆ ఫోటోల్లో కనిపిస్తున్న గ్యాంగ్ను చూస్తే సలార్ ఎండింగ్లో వివిధ తెగలు తమ తమ ఆర్మీలతో సిద్ధమైన దృశ్యాలు గుర్తొస్తున్నాయి. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ లీక్తో లింక్ చేసి చూస్తే సలార్ మరియు ఎన్టీఆర్ నీల్ సినిమాలు క్రాసోవర్ చేసుకుంటూ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడా అన్న అనుమానం బలంగా కలుగుతోంది.
ఇదే జరిగితే ఆడియెన్స్కు మైండ్ బ్లాక్, బాక్సాఫీస్కు బ్లాస్ట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. సో ఈ క్రాసోవర్ నిజమవుతుందా అన్న సస్పెన్స్కు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
