ఎయిర్ ఇండియా సర్వర్ షట్ డౌన్…ప్రపంచవ్యాప్తంగా నిలిచిన విమానాలు

Air India pilot leaves flight

భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ అయ్యింది. ఒక్కసారిగా ఎయిరిండియాకు చెందిన ప్రధాన సర్వర్ అయిన సిటా సర్వర్ ఈ ఉదయం 3:30 గంటల నుంచి పనిచేయడం మానేసింది. దేంతో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. 5 గంటలుగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్, ముంబై, చండీగడ్ సహా డొమెస్టిక్ విమాన సేవలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 5 గంటలు గడిచినా సమస్యను పరిష్కరించలేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. ఎంతసేపటిలో సమస్యను పరిష్కరిస్తారు అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. సర్వర్ డౌన్ అయితే టెక్నికల్ గా తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు.