599 రీఛార్జిపై జీవిత బీమా ఇవ్వనున్న ఎయిర్‌టెల్‌

599 రీఛార్జిపై జీవిత బీమా ఇవ్వనున్న ఎయిర్‌టెల్‌

599 రూపాయల ప్లాన్‌  రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు ఎయిర్‌టెల్‌ భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో జత కట్టి 4లక్షల రూపాయల విలువైన బీమా సౌకర్యాన్ని అందచేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ 84 రోజులు చెల్లుబాటులో ఉండి రోజుకు 2జీబీ డేటా ఇవ్వనుంది. వేరే ఇతర నెట్‌వర్క్‌కు అపరిమిత కాల్స్ ఇంకా ఒక రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఇవ్వనుంది.

ప్రతిసారి చేసే రీఛార్జితో మూడు నెలల వరకు ఆటోమాటిక్‌గా బీమా కవర్ కొనసాగుతూ ఉంటుంది. భారతి ఎయిర్‌టెల్ సీఈవో వాణి వెంకటేష్‌ మాట్లాడుతూ వినియోగదారులకు లైఫ్ ఇన్సూరెన్స్‌ను భారతి ఆక్సా లైఫ్ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో కలిసి అందించడం ఆనందంగా ఉందని ఇంకా ఎలాంటి వైద్య పరీక్షలు, ధృవీకరణపత్రం లేకుండానే తక్షణమే డిజిటల్‌ కాపీని 18నుండి54 సంవత్సరాల వయస్సు గల కస్టమర్లకి ఇంటికే పంపిస్తామని తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో ఈ సేవలను అందిస్తున్నామని ఇంకా అదే విదంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆఫర్‌ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రయోజనం పొందడానికి, కస్టమర్ ఎస్‌ఎంఎస్‌, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా వినియోగదారులు మొదట రీఛార్జ్ చేసిన తర్వాత ఈ ప్రయోజనం పొందడానికి ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.