చిరంజీవి పై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి

చిరంజీవి పై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. స్థాయి మరిచి మెగాస్టార్‌పైనే దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్‌ అంటే తోకతొక్కిన తాచులా పైకిలేచే శ్రీరెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అంటే కాస్త అభిమానమే. దీంతో ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేది తప్ప మెగాస్టార్‌పై మాటతూలేది కాదు. అయితే బిగ్ బాస్ స్టేజ్‌పై శ్రీరెడ్డిని పరోక్షంగా మెగాస్టార్ విమర్శించడంతో శ్రీరెడ్డికి తన సహజత్వాన్ని బయటకు తీసి మెగాస్టార్‌ను బండబూతులు తిడుతోంది.

సారీ చిరంజీవి గారు నేను చాలా స్మూత్‌గానే మాట్లాడుతున్నా మంచి గురించి మాత్రమే మాట్లాడుతున్నా నా వ్యాఖ్యల్ని తీసుకోండి. మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా, వయసు కాదు జ్ఞానం ఉండాలి’ అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్‌ని తొక్కి తొక్కి 13 హీరోస్‌ని కన్నారు. నన్ను కూడా తొక్కుతారా నన్ను కెలకవద్దు. నా జోలికొస్తే పంబ పగిలి రంభ బయటకొస్తాది’ అంటూ చిరంజీవికే వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.

ఇంతకీ శ్రీరెడ్డిని మెగాస్టార్ ఏమన్నారు ఆమె కోపానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమన్నా సింహాద్రి. అవును శ్రీరెడ్డిపై మెగాస్టార్ పరోక్షంగా చురకలేసింది ఎక్కడ నుండో బిగ్ బాస్ స్టేజ్ మీది నుండే.

ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి హౌస్‌లో ఉన్న తమన్నా సింహాద్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘తమన్నా వెరీ డైనమిక్ గర్ల్. తేడాలొస్తే చీల్చి చెండాడుతావ్ ప్రేమిస్తే మనసు ఇచ్చేస్తావ్ తప్పు జరిగితే ఏదైనా సరే బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడగలిగే ధైర్య వంతురాలివి నువ్ నువ్వు అప్పటి వరకూ ఎవర్ని సపోర్ట్ చేసినా సరే వాళ్లు మంచి వ్యక్తుల్ని విమర్శిస్తే ఆ ఫ్రెండ్ షిప్‌ని కూడా కట్ చేసుకుని బయటకు వచ్చి నువ్ చేస్తున్నది తప్పు చెప్పే ధైర్యం నీలో ఉన్నది. ఆ విషయంలో నిన్ను అభినందిస్తున్నా. ఇది నీకు నాకు మాత్రమే అర్ధమై ఉంటుంది. ఇంకెవరికీ అర్ధంకాకపోవచ్చు కరెక్టేనా’ అంటూ తమన్నాని ఉద్దేశించి మాట్లాడారు.