దాచేప‌ల్లిలో మ‌రో దారుణం… 12 ఏళ్ల బాలిక‌ను గ‌ర్భ‌వ‌తి చేశాడు

another Minor Girl raped in Dachepalli

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దాచేప‌ల్లిలో మ‌రో అకృత్యం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక‌పై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌నను మ‌ర్చిపోక‌ముందే అంత‌కంటే దారుణం వెలుగుచూసింది. దాచేప‌ల్లి మండల కో ఆప్ష‌న్ స‌భ్యుడు మ‌హ‌బూబ్ వ‌లీ 12 ఏళ్ల బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేశాడు. కొంత‌కాలంగా బాలిక‌ను బెదిరిస్తూ మ‌హ‌బూబ్ ఆమెపై అత్యాచారం జ‌రుపుతున్నాడు.

ఈ విష‌యం ఎవ‌రిక‌న్నా చెబితే చంపుతాన‌ని ఆ చిన్నారిని భ‌య‌పెట్టాడు. దీంతో బాలిక ఎవ‌రికీ విష‌యం చెప్ప‌లేదు. కానీ ఆమె శ‌రీరంలో వ‌చ్చిన మార్పులు పసిగ‌ట్టి… త‌ల్లిదండ్రులు… ప్ర‌శ్నించ‌డంతో మ‌హ‌బూబ్ దారుణం గురించి వివ‌రించింది. వారు స్థానికుల స‌హ‌కారంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ ఘాతుకం వెలుగుచూసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు బాలిక‌ను వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం గుర‌జాల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇటీవ‌లి దాచేప‌ల్లి దారుణంపై ముఖ్య‌మంత్రి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చిన్నారుల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డేవారికి అదే చివ‌రిరోజు కావాల‌ని సీఎం వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను ఇంత సీరియ‌స్ గా తీసుకుంటున్న‌ప్ప‌టికీ… ఇలాంటి దారుణాలు వెలుగుచూడ‌డం ఆందోళ‌న‌క‌లిగిస్తోంది.