టీడీపీకి మరో షాక్…కాషాయ గూటికి మరో సీనియర్ నేత

another shock to tdp

ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన కమలదళం ముఖ్యంగా టీడీపీలో సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోగా మరికొందరు నేతలు అదే దారిలో ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు బీజేపీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాయపాటిని పార్టీలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని చర్చ నడుస్తోంది. రెండు రోజుల క్రితమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ గుంటూరులో రాయపాటిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్-సాంబశివరావు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలోకి రావాలని రాయపాటిని రాంమాధవ్ కోరగా అనుచరులతో చర్చించాక నిర్ణయం చెబుతానని మాజీ ఎంపీ చెప్పారట. రాయపాటి తాను త్వరలోనే ఢిల్లీ వస్తానని అక్కడ కలుస్తానని రాంమాధవ్‌తో చెప్పారట. ఆయన కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాంమాధవ్‌తో భేటీ తర్వాత రాయపాటి చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారట. పార్టీ మారే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సాంబశివరావు కూడా కొన్ని ఇబ్బందులు వల్ల బీజేపీలోకి వెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నారని టాక్.