మంత్రికి నియోజకవర్గంలోనే వ్యతిరక పవనాలు !

Ap Minister Jawahar Getting Troubles For Ticket

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మంత్రి జవహర్ తాలూకాలో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. జవహర్‌ కు మళ్లీ టికెట్ ఇవ్వాలని ఒక వర్గం పట్టుపడుతుంటే.. టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ మరో వర్గం కయ్యానికి కాలు దువ్వుతోంది. రెండు గ్రూపులు గత వారమే అమరావతికి పోటా-పోటీగా ర్యాలీగా వెళ్లాయి. చంద్రబాబును కలిసి టికెట్ వ్యవహారం మీద పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి.ఈ గొడవ సద్ధుమణగకముందే జవహర్ వ్యతిరేక వర్గం మళ్లీ ఆందోళనలకు దిగింది.

మంత్రికి టికెట్ కేటాయించొద్దంటూ బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది. #నిన్ను నమ్ముతాం బాబు #అవినీతిపరుడు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. జవహర్‌ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ కొవ్వూరు పట్టణంతో పాటు రూరల్‌ గ్రామాల్లో జవహర్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. దీంతో నిన్న ప్రజా దీవెన యాత్ర పేరుతో జవహర్‌ అనుకూల వర్గం భారీ ర్యాలీ నిర్వహించిందట. అందులో మంత్రి జవహర్‌ కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి కౌంటర్‌గానే ఇప్పుడు వ్యతిరేక వర్గం ర్యాలీ చేపట్టింది. మంత్రి వ్యతిరేకం వర్గానికి కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ సూరపునేని రామ్మోహన్‌రావు, సీనియర్‌ నేతగా ఉన్న ఉప్పులూటి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు.