ఇళయ దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ (jananayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ సినీ కెరీర్లో చివరి చిత్రంగా నిలిచింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీపై రిలీజ్కు ముందే భారీ హైప్ నెలకొంది.
‘జన నాయగన్’ విజయ్ రాజకీయ ప్రస్థానంతో పాటు ఆయన సినీ ప్రయాణంలోనూ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఎన్నో అంచనాలు, పలు అవాంతరాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 ‘జన నాయగన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
‘జన నాయగన్’ ఒరిజినల్ తమిళ్ వెర్షన్తో పాటు తెలుగు డబ్బింగ్ వంటి ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన విజయ్ అభిమానులు, మూవీ లవర్స్ ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు.
ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా నిలిచిన ‘జన నాయగన్’ ఓటీటీలో ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.

