టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన క్లాసిక్ మూవీ ‘నీ స్నేహం’ (Nee Sneham) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ను మేళవించిన ఈ చిత్రం అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్పై ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. కథ, భావోద్వేగాలతో పాటు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆర్.పి. పట్నాయక్ అందించిన పాటలు అప్పట్లో సూపర్ హిట్గా నిలవడంతో పాటు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
తాజాగా ‘నీ స్నేహం’ చిత్రాన్ని 4K డిజిటల్ వెర్షన్లో సెప్టెంబర్ 19న గ్రాండ్గా రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ అభిమానుల్లో మరోసారి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అప్పటి జ్ఞాపకాలను మరోసారి థియేటర్లలో ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.

మరి ఇన్నేళ్ల తర్వాత 4K వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘నీ స్నేహం’ థియేటర్లలో ఎలాంటి స్పందనను సొంతం చేసుకుంటుందో చూడాలి.



