తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’ థియేట్రికల్ రిలీజ్కు ముందే జపాన్లో హాట్ టాపిక్గా మారింది. ఆగస్టు 21న జపాన్లో గ్రాండ్గా విడుదల కానున్న ఈ చిత్రం, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్లోనే అదిరిపోయే వసూళ్లను నమోదు చేస్తూ సత్తా చాటుతోంది.
జపాన్లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అత్యధిక బుకింగ్స్ సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ (Mirai) ఇప్పటికే చోటు సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’, ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ వంటి చిత్రాల సరసన నిలిచే స్థాయిలో ఈ మూవీ బుకింగ్స్ దూసుకెళ్తున్నాయి. దీంతో జపాన్లో టాప్ 10 డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన తెలుగు చిత్రాల్లో ‘మిరాయ్’ కూడా చేరింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, ‘మిరాయ్’ సీక్వెల్కు సంబంధించిన పనులు కూడా ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్కు ముందే జపాన్లో కనిపిస్తున్న ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్, విడుదల తర్వాత బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర యూనిట్ మాత్రం జపాన్ మార్కెట్లో ‘మిరాయ్’ మరింతగా సత్తా చాటుతుందని నమ్మకంగా ఉంది.





