AP Politics: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక కరెంట్‌ ఛార్జీలు పెరుగుతాయా..?

AP Politics: Good news for the people of AP.. will the current charges increase..?
AP Politics: Good news for the people of AP.. will the current charges increase..?

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో ఇక కరెంట్‌ ఛార్జీలు పెరగవ్. విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డిస్కమ్ లు(SPDCL, EPDCL, CPDCL) తీసుకున్నాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారిఫ్ లే కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.

రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్ కు రూ. 1, గ్రీన్ పవర్ కేటగిరీలో 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఈఆర్సిని కోరాయి. వీటికి త్వరలో ఆమోదం లభించనుంది. దీంతో ఏపీలో ఇక కరెంట్‌ ఛార్జీలు పెరగవన్న మాట. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఏపీ ప్రజలకు భారీ ఊరట లభించనుంది.