పదో తరగతి విద్యార్థి మృతి

పదో తరగతి విద్యార్థి మృతి

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్‌కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో బాసర నదిలో తోటివారితో అడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే 10వ తరగతి మృతి చెందాడు.

హైదరాబాద్‌ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా…12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్ చేసి చెప్పారు. అయితే మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చిన స్కూల్‌ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యుల వద్ద వదిలి వెళ్లారు. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యా నికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద ప్రాంతాలకు విద్యార్థులను పర్యాటక క్షేత్రలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు.