సెమీ ఫైనల్లో బెంగళూరు బుల్స్

సెమీ ఫైనల్లో బెంగళూరు బుల్స్

మూడు పాయింట్ల తేడాతో యూపీ యోధాపై గెలుపొందిన బెంగళూరు బుల్స్ ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో సెమీ ఫైనల్లో స్థానం సంపాదించింది.సెమీ ఫైనల్‌లో రేపు బుధవారం బెంగళూరు బుల్స్ దబాంగ్ ఢిల్లీతో తలపడనుంది.

48-45 తేడాతో విజయాన్ని అందుకున్న బెంగళూరు బుల్స్ ని రైడర్ పవన్ షెరావత్ వరుస పాయింట్లతో నిలబెట్టి విజేతగా నిలిపాడు. 25 సార్లు రైడ్‌కి వెళ్లిన పవన్ షెరావత్  ఏకంగా 20 పాయింట్లని సాదించాడు. బెంగళూరు బుల్స్ ఇప్పటికే నెం.1 స్థానంలో నిలిచిన దబాంగ్ ఢిల్లీ తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడనుంది. యూపీ యోధా ఫస్ట్ హాఫ్ లో 15-4 తో ఆధిక్యంలో నిలిచిన కూడా చివరలో మూడు పాయింట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి తప్పుకుంది.