ఏపీలో రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్ళను రద్దు

Good news for Ayyappa devotees… 22 more special trains to Sabarimala
Good news for Ayyappa devotees… 22 more special trains to Sabarimala

ఏపీలో రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం ఏలూరు మీదుగా వెళ్లే కొన్ని రైళ్ళను రద్దు చేయగా, మరికొన్నిటిని దారి మళ్ళించారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడుకు, విజయవాడకు మధ్యలో రైళ్ల రాకపోకలు పూర్తిగా రద్దు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

ఈనెల 13, 14, 15, 17, 18 తేదీలలో…. విజయవాడ – విశాఖపట్నం(22702), విశాఖ – విజయవాడ(22701) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు – విశాఖపట్నం(17239) ఈనెల 13 నుంచి 19 వరకు…. విశాఖపట్నం – గుంటూరు(17240) 14 నుంచి 20 వరకు రద్దు చేశారు. విజయవాడ – నర్సాపూర్(07861), నరసాపురం – విజయవాడ(07863) రైళ్లను ఈనెల 13 నుంచి 19 వరకు విజయవాడ – రామవరప్పాడు మధ్యలో అధికారులు రద్దు చేశారు.