వికారాబాద్‌లో జరిగిన బైక్ రేసింగ్‌…ఎన్నారై మృతి

bike racing in vikarabad

వికారాబాద్‌లో జరిగిన మౌంటైన్ బైక్ రేసింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 1న ఈ ఘటన జరగ్గా విషయం బయటకి పొక్కలేదు. కానీ ఆయన పడిపోతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నివాసం ఉండే హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌ ఇటీవల నగరానికి వచ్చాడు.  స్నేహితులతో కలిసి వికారాబాద్ జిల్లా గోధుమగూడ సమీపంలోని ఓ రిసార్టులో మౌంటైన్ బైక్ రేసింగ్‌కు వెళ్లాడు. రేసింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే విషయం బయటకు పొక్కితే రిస్టార్ట్ పేరు పోతుందని యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తప్పక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  రిసార్ట్స్‌ యజమానులు కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.