పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉగ్రమూకలు

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉగ్రమూకలు

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కిస్సా ఖ్వానీ బజార్‌లోని ఓ మసీదుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ప్రవేశించిన ఓ ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్‌ అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వీరిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.