Breaking: ఏపీ విద్యార్థులకు అలెర్ట్ …రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్

Breaking: Alert to AP students...Schools and colleges will be closed tomorrow
Breaking: Alert to AP students...Schools and colleges will be closed tomorrow

ఏపీ విద్యార్థులకు అలర్ఠ్…రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన, విశాఖ ఉక్కు పరిరక్షణకు మద్దతుగా నవంబర్ 8న అంటే రేపే విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు PDSU, AISF, AIYF ప్రకటించాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి రేపటితో 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నారు. అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

ఇది ఇలా ఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతి పక్షాలు.. అలాగే విశాఖ ఉక్కు కార్మికులు దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు.