Breaking News: ఇవాళ సాయంత్రం కేసీఆర్ కు సర్జరీ

TG Politics: Delhi Liquor case is bogus.. BRS post going viral...
TG Politics: Delhi Liquor case is bogus.. BRS post going viral...

BREAKING : ఇవాళ సాయంత్రం కేసీఆర్ కు సర్జరీ జరుగనుంది. హైదరాబాద్ యశోధ ఆస్పత్రిలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు సమాచారం.

దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం మేజర్ సర్జరీ జరుగనుంది. దీంతో కేసీఆర్ ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఒంటర్ ప్రతాప్ రెడ్డి, కే. కేశవ్ రావు, కోనేరు కోనప్ప క్యూ కట్టారు.

మరోవైపు పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఆరోగ్యంపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయనకు గాయమైందని తెలిసి బాధగా ఉందని.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు.