అనసూయకు బంఫర్ ఆఫర్

అనసూయకు బంఫర్ ఆఫర్

జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లి తెరపై మంచి పేరు తెచ్చుకున్న అనసూయ రెండు మూడు సినిమాలలో నటించి వెండి తెరపై కూడా మంచి మార్కులే కొట్టేసింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం ఎంత హిట్ టాక్‌ని సంపాదించుకుందో ఆ సినిమాలో రంగమ్మ అత్త పాత్రను అద్భుతంగా చేసిన అనసూయ కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇకపోతే క్షణం, కథనం వంటి సినిమాలు కూడా ఆమెను మంచి నటిగా నిలబెట్టాయి. అయితే ప్రస్తుతానికి బుల్లితెరపై రెండు మూడు షోలు చేస్తున్న అనసూయకు బన్నీ, పవన్ సినిమాలో నటించే ఆఫర్ వచ్చిందని సమాచారం. అయితే బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో సుకుమార్ అనసూయను విలన్‌గా చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకతంలో ఒక సినిమాను చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకు అనసూయను తీసుకుంటున్నట్టు, ఈ పాత్ర అరగంట మాత్రమే ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇదే కనుక జరిగితే అనసూయ వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో నటించినట్టవుతుంది.