బుమ్రా వచ్చిండు.. టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టిండు..!

Jasprit Bumrah
Jasprit Bumrah

టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. వెస్టిండీస్ జట్టుపై టీమిండియా సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ లో మాత్రం టీమిండియా శుభారంభం చేసింది. ఐర్లాండ్ జట్టుపై ఏకంగా రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది .మ్యాచ్ కు వర్షం అడ్డు తగలడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియాకు విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అయితే టార్గెట్ చేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కు ఆది నుంచి వర్షం అడ్డు తగిలింది. అయితే వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది టీమిండియా. దీంతో మ్యాచ్ పైకి కలగజేసుకున్న ఎంపైర్లు…. డక్వర్తు లూయిస్ పద్ధతి ప్రకారం టీమ్ ఇండియాకు రెండు పరుగుల విజయాన్ని ఇచ్చారు. దీంతో టీమిండియాకు బుమ్రా వచ్చాక మొదటి విజయం అందిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.