వాళ్ళని కూడా వదల్లేదట…కోడెల కుమార్తె మీద కేసు

వాళ్ళని కూడా వదల్లేదట...కోడెల కుమార్తె మీద కేసు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై ఏరియా ఆస్పత్రి స్వీపర్లు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి పీఏ, ఆస్పత్రి కాంట్రాక్టర్ పై కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రతి నేలా తమ జీతంలో పీఎఫ్ పేరుతో రెండు వేలు కట్ చేశారని, ఆ డబ్బు కాంట్రాక్టర్, పీఏ, కోడెల కూతురు తినేశారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా తమ జీతం నుంచి కట్ చేసుకున్ 15 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని స్వీపర్లు డిమాండ్ చేశారు. కోడెల విజయలక్ష్మి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.