వారిద్దరూ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్ బాగుపడుతుందట !

 వారిద్దరూ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్ బాగుపడుతుందట !

పార్టీ పదవులకు ఉత్తమ్, కుంతియా రాజీనామ చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడుతుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దని రాహుల్ గాంధీనే రాజీనామా చేసిన తర్వాత ఎవరేం చేస్తారని ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. పాదయాత్ర కాదు మోకాళ్ల మీద నడిచినా కేసీఆర్ వినే పరిస్థితుల్లో లేరని, రైతుల కోసమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర మంచిదే అన్నారు రాజగోపాల్ రెడ్డి. తాను పార్టీ మారడం వల్ల ప్రభుత్వాలు మారే పరిస్థితి లేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతులు కాలాక పీసీసీ పదవులు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుందని మరోసారి ఆయన తేల్చిచెప్పారు.