బీజేపీకి అందుకే రాం రాం చెప్పాం !

chandra babu comments on bjp

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొవ్వూరు మండలం పశివేదలలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముందుగా వాళ్ళే వచ్చి మీకు అన్యాయం జరిగింది అని చెప్పి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిన బీజేపీ ఏ విషయంలోనూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం లెక్కలేనితనం వల్ల వారితో విభేదించి బయటకొచ్చేశామని చంద్రబాబు తెలపారు.

ఎన్టీఅర్ స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి ఎవరి కోసం లాలూచీ పడదని, అందుకే నాలుగేళ్ళు కలిసి ఉన్న పార్టీకి రాం రాం చెప్పి ఇద్దరు మంత్రులని బయటకి రప్పించి పోరాటం మొదలు పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టించి దేశం మొత్తం కేంద్రం చేస్తున్న కుట్రల వంక చూసే ప్రయత్నం చేసామని ఆయన చెప్పుకొచ్చారు.