బిగ్‌బాస్‌లో ప్రమోషన్‌ చేస్తే ఫట్టే!

Tollywood Producers Fear to do Promotion on Bigg Boss

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా సాగుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 సగానికి వచ్చేసింది. వంద రోజుల ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ‘జంబలకిడి పంబ’, ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’, ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రమోషన్స్‌ను బిగ్‌బాస్‌లో చేసేందుకు కొందరు నిర్మాతలు భయపడుతున్నారు. బిగ్‌బాస్‌లో ప్రమోషన్‌ చేస్తే ఫ్లాప్‌ అవుతుందేమో అనే సెంటిమెంట్‌కు నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఇకపై సినిమాల ప్రమోషన్స్‌ ఉండక పోవచ్చు అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఉన్న సమయంలో బిగ్‌బాస్‌లోకి నేనే రాజు నేనే మంత్రి, ఆనందో బ్రహ్మా, అర్జున్‌ రెడ్డి, జై లవకుశ చిత్రాల ప్రమోషన్స్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు వెళ్లారు. ఆ చిత్రాలు అన్ని కూడా మంచి విజయాలను దక్కించుకుంది. కాని ఈసారి మాత్రం బిగ్‌బాస్‌ సీజన్‌లో ప్రమోషన్‌ జరుపుకున్న చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. అందుకే ఇకపై కూడా బిగ్‌బాస్‌లో ప్రమోషన్‌ కోసం సినిమాల ప్రమోషన్‌ ఉండదని అనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్‌ నిర్వాహకులు మాత్రం సినిమాల ప్రమోషన్స్‌కు చిత్ర యూనిట్‌ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ‘సాక్ష్యం’ చిత్ర యూనిట్‌ సభ్యులను బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఆహ్వానించడం జరిగింది. మరి వారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.