ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం

ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం

గత కొన్ని రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల వార్తలు వింటూనే ఉన్నాము కొన్ని క్రితమే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు టాప్ సినీ తారలపై ఐటీ దాడులు కలకలం రేపాయి.అలాగే ఇటీవలే కోలీవుడ్ టాప్ హీరో విజయ్ పై కూడా ఐటీ సోదాలు జరగడం మరింత హైప్ రేపగా ఇప్పుడు అదే సినిమాల తరహాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఐటీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నట్టు అనిపిస్తుంది.చంద్రబాబుకు సంబంధించిన అత్యంత సన్నిహితులు అయినటువంటి పలువు కీలక వ్యక్తులపై ఆకస్మిక ఐటీ దాడులు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.

కడప టీడీపీ టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి మరియు బాబు మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ డి నరేష్ చౌదరి,ప్రత్తిపాటి కుమారుడు ప్రత్తిపాటి శరత్ ల ఇళ్లల పై ఏకకాలంలో భారీ బందోబస్త్ నడుమ ఈ దాడులు జరగడం ఆశ్చర్యం కలిగించాయి.గడిచిన ఎన్నికల్లో వీరి ద్వారానే భారీ స్థాయిలో డబ్బులు పంపిణీ జరిగాయని ఈ ఆరోపణల నిమిత్తమే వీరిపై ఐటీ దాడులు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా మెయిన్ గా ఉన్నటువంటి చంద్రబాబునే టార్గెట్ చెయ్యడానికి చేస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.