చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ విజయసాయి

చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో సెటైర్లు గుప్పించారు. తాజాగా ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందని రాయిటర్స్ రాసిన కథనం సంచలనం సృష్టించింది. అంతేకాదు దీనిపై చంద్రబాబు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వ వైఖరి వలనే కియా ఏపీ నుంచి తరలిపోతుందని ఆరోపణలు చేశారు.

అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ విజయసాయి ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు అంటూ ఆయన అన్నింటికి తెగబడి పోయాడని అన్నారు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడని, ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.