ఆ కమెడియన్ కి బాబు థాంక్స్.

Chandrababu say thanks to comedian Venu Madhav

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున నాయకులకి అయితే కొదవ లేదు గానీ జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు చేసే వాళ్ళ లోటు కొంచెం వుంది. ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఆ లోటు పూడ్చాడు కమెడియన్ వేణు మాధవ్. ఏదో తన స్టైల్ లో కామెడీ పండిస్తాడులే అని ప్రచారానికి పిలిచిన చంద్రబాబు కూడా అనుకున్నారు. అయితే జరిగింది వేరు. నంద్యాల ప్రచారంలో వేణు మాధవ్ యాక్షన్ హీరో అయిపోయాడు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ ని, ఇంకో వైపు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాని షేక్ చేసాడు. తన దగ్గర డబ్బు, పత్రికలు, చానెల్స్ లేవంటూ జగన్ అబద్ధపు ప్రచారం చేస్తుంటే టీడీపీ నేతలు దాన్ని సరిగ్గా కౌంటర్ చేయలేకపోయారు. ఆ టైం లో సాక్షి పత్రిక, ఛానల్ ఎవరివి బట్టెబాజ్ అంటూ వేణుమాధవ్ చేసిన కామెంట్స్ నంద్యాల ప్రచారాన్ని వేడెక్కించాయి.



ఆ కామెంట్స్ తర్వాత వైసీపీ శ్రేణుల నుంచి వేణు మాధవ్ తీవ్ర బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వేణు మాధవ్ వెనక్కి తగ్గలేదు. నంద్యాల లో టీడీపీ విషయానికి తన వంతు పాత్ర పోషించిన వేణు మాధవ్ ఈ రోజు అమరావతి వచ్చారు. సీఎం చంద్రబాబుని కలిసి అభినందనలు తెలిపారు. నంద్యాల ప్రచారం లో పాల్గొన్న వేణు మాధవ్ కి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు థాంక్స్ చెప్పారట. దీంతో పొంగిపోయిన వేణు మాధవ్ భవిష్యత్ లో కూడా పార్టీ అవసరాలకి తాను ముందు ఉంటానని బాబుకి మాట ఇచ్చి వచ్చారట.




మరిన్ని వార్తలు:

సంప‌న్న నేర‌స్థుల్లో రెండో స్థానంలో దావూద్

సింగ‌పూర్ కు మ‌హిళా అధ్య‌క్షురాలు

వాళ్లకి కూడా పరిటాల పెళ్లి పిలుపు.