ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల జాబితాలో టాలీవుడ్ నుంచి వారణాసి (Varanasi), బాలీవుడ్ నుంచి రామాయణ చిత్రాలు ముందువరుసలో ఉన్నాయనే విషయం తెలిసిందే. భారీ బడ్జెట్లతో, తొలి ఐమ్యాక్స్ అనుభూతిని అందించే చిత్రాలుగా ఇవి ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇలాంటి సమయంలో ఈ సినిమాల బడ్జెట్లపై పాపులర్ యాక్టర్, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ మనోజ్ బాజ్పాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ‘రామాయణ’, ‘వారణాసి’ చిత్రాలకు చెబుతున్న భారీ బడ్జెట్ లెక్కలు అన్నీ కేవలం పీఆర్ స్టంట్స్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. హైప్ కోసం మాత్రమే ఇలాంటి నెంబర్లు ప్రచారం చేస్తారని, దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ కొనసాగుతోందని ఆయన ఇటీవల బాలీవుడ్లో మాట్లాడారు.
అయితే ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రావడానికి కారణం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. మనోజ్ బాజ్పాయ్ తన ‘గవర్నర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడంతోనే, దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ, మనోజ్ చేసిన ఈ స్టేట్మెంట్ మాత్రం ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతూ మంచి రీచ్ సంపాదించుకుంది.
