హీరోగా కీరవాణి కొడుకు

హీరోగా కీరవాణి కొడుకు

కీరవాణి చిన్న కుమారుడు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ సింహా వెండి తెర మీద రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం యమ దొంగలో బాల నటుడుగా ఇంకా మర్యాద రామన్న, బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాల్లోనూ నటించాడు.కొంత కాలం దర్శకత్వం శాఖలో పనిచేస్తు హీరోగా మత్తు వదలరా సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. కీరవాణి పెద్ద కొడుకు కాళభైరవ గాయకుడిగా సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రిలో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా పని చేశాడు. హీరోగా పరిచయం అవుతున్న సినిమాకి రితేష్‌ రానా అని కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు.శ్రీ కృష్ణపాండవీయం సినిమాలోని పాట “మత్తు వదలరా” టైటిల్‌ని ఖరారు అయింది.