యూత్ లీడర్‌కి కీలక పదవిని అప్పగించిన సీఎం జగన్

యూత్ లీడర్‌కి కీలక పదవిని అప్పగించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్  హైదరాబాద్‌కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత అమిత్ ఠాకూర్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీలో భాగంగా ఉన్న హైదరాబాద్‌‌ సలహా కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం అమిత్ ఠాకూర్‌ వైసీపీ హైదరాబాద్ సిటీ యూత్ లీడర్‌గా ఉన్నాడు.

అయితే మొత్తం మొత్తం 11 మంది సభ్యులను సలహా కమిటీలో ఎంపిక చేయగా అందులో అమిత్ ఠాకూర్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే టీటీడీ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేసినందుకు అమిత్ ఠాకూర్‌ సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపారు.