రేపు కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ షర్మిల పర్యటనలు. . .

CM YS Jagan and YS Sharmila will visit Kadapa district tomorrow.
CM YS Jagan and YS Sharmila will visit Kadapa district tomorrow.

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేరుకోనున్నారు.దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్న …ఆ తర్వాత వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్నారు.

అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి జగన్‌. ఇక అటు.. ఇవాళ కడప జిల్లా పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. రేపు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్నారు షర్మిల. ఇందులో భాగంగానే కడప జిల్లా పులివెందులకు వైఎస్ షర్మిల ఇవాళ వెళ్లనున్నారు. ఈ మేరకు షర్మిల అనుచరులు అన్ని ఏర్పాట్లు చేసారు.