విశాఖలో కానిస్టేబుల్ ని నడిరోడ్డు మీద నరికిన దుండగులు…!

Constable Stabbed And Death At Visakhapatnam District

పెద్దగా గొడవలు లాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండే విశాఖ జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేట్ వద్ద ఓ కానిస్టేబుల్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. కారులో వచ్చిన 8 మంది దుండగులు టోల్ ప్లాజా వద్ద నిలబడి ఉన్న తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్‌ ను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం వారు వచ్చిన వాహనంలోనే పరారయ్యారు.

police-conistable

ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన నీలమగ అమరన్‌గా గుర్తించారు. అతడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలియజేశారు. గంజాయి స్మగ్లర్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కానిస్టేబుల్‌ను హతమార్చి పారిపోతున్న దుండగులను గ్రామస్థులు వెంబడించి పట్టుకున్నారు. వారిని యలమంచిలి సమీపంలో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆరుగురు నిందితులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

jail