కోహ్లీ నిర్ణయం మంచిదే అంటున్న అభిమానులు

కోహ్లీ నిర్ణయం మంచిదే అంటున్న అభిమానులు

రిషభ్‌పంత్‌ను పక్కనపెట్టడంపై క్రికెట్అభిమానులు ట్విటర్‌లో పెద్దఎత్తున స్పందన తెలియచేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలిటెస్టుకు తలపడనున్న భారతజట్టు రిషభ్‌పంత్‌ను పక్కనపెట్టినట్టు  సారథి విరాట్ కోహ్లీ తెలిపారు.సాహానే అద్భుతమైన కీపర్‌,యువబ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను పక్కనపెట్టడం సరిఅయినదే  కోహ్లీ నిర్ణయం మంచిదేనని ట్విటర్‌లో అభిమానులు తమ అభిప్రాయాలని తెలిపారు.

ఆటను మెరుగుపర్చుకోవాలని కొందరు ఈ యువ ఆటగాడు రిషప్  పంత్ కి సూచిస్తుండగా, సీనియర్‌కీపర్‌ వృద్ధిమాన్‌సాహాను రిషభ్‌పంత్‌ బదులు జట్టులోకి తీసుకున్నామని కోహ్లీ చెప్పారు.సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్‌ అని మన సారథి విరాట్ కోహ్లీ పొగిడారు. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ పర్యటనల్లో యువకీపర్‌ పంత్‌ బానే రాణించాడు. కాని ఈ మద్యకాలంలో విండీస్‌ పర్యటనలోనూ పంత్‌ సరిగా రాణించకపోవడంతో చాలా విమర్శలు ఎదుర్కుంటున్నాడు.