Crime: ఏపీలో దారుణం.. భర్త మర్మాంగంపై మసిలే నీటిని పోసిన భార్య

Crime: Atrocious in AP.. Wife pours boiling water on her husband's body
Crime: Atrocious in AP.. Wife pours boiling water on her husband's body

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మసిలే నీటిని భర్త మర్మాంగంపై పోసింది ఓ భార్య. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు నాయిని ప్రభుదాసు, అనూషా మధ్య కొంతకాలంగా గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భర్త మర్మాంగంపై సల సల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నం చేసింది. మర్మాంగం కాలిపోయి తీవ్ర గాయాలతో నాయిని ప్రభుదాసు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.