అది ఉత్తుత్తి టెండర్….ఇంటర్ విద్యార్ధుల భవిత నాశనం !

Anti-Sterlite protest in Tamil Nadu Tuticorin turns violent

తెలంగాణలో ఇంటర్ ఫలితాల ప్రకటనలో చెలరేగిన గందరగోళం కారణంగా 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరీనా సంస్థకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి డేటా ప్రాసెసింగ్‌, ఫలితాల విడుదల ప్రక్రియపై గ్లోబరీనా సంస్థ, ఇంటర్ బోర్డు మధ్య చట్టబద్ధమైన ఒప్పందం ఏదీ లేదని తేలింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ ఈ విషయాన్ని గుర్తించింది. కేవలం పర్చేజింగ్ ఆర్డర్ తోనే గ్లోబరీనా సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారని కమిటీ తేల్చింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, గ్లోబరీనా సంస్థ సీఈఓ వీఎస్‌ఎన్‌ రాజు, ఇంటర్‌ బోర్డు ఓఎస్‌డీ సుశీల్‌కుమార్‌ సహా ఇతర ఉన్నతాధికారులతో నిన్న ఈ త్రిసభ్య కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డుతో ఒప్పందానికి సంబంధించి ఎలాంటి రికార్డులు తమవద్ద లేవని గ్లోబరీనా ప్రతినిధులు చేతులు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో వాటిని తప్పనిసరిగా తీసుకురావాలని కమిటీ ఆదేశించింది. రేపు ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశముందని భావిస్తున్నారు.