నాన్న, మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌

Dad, you are a leader who will live forever in people's hearts even though you are no longer physically with us
Dad, you are a leader who will live forever in people's hearts even though you are no longer physically with us

నాన్న, మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు అని వెల్లడించారు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయని.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి నేపథ్యంలోనే సీఎం జగన్‌ పోస్ట్‌ పెట్టారు .

మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయని.. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ సీఎం జగన్‌ ఎమోషనల్‌ అయ్యారు .కాగా, ఇడుపులపాయకు సీఎం జగన్ బయలుదేరి వెళ్ళనున్నారు. వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.

కాగా, ఇవాళ కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం జగన్‌ ఇడుపులపాయ చేరుకోనున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్‌ నివాళులు అర్పించనున్నారు