నిరాశ చెందుతున్న భక్తులు

నిరాశ చెందుతున్న భక్తులు

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి ఉన్నటువంటి దారులన్నీ కూడా మూసేస్తున్నట్లు టీటీడీ బోర్డు నిర్ణయించింది. కాగా ఈ మేరకు అలిపిరి చెక్ పోస్టు ముసేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చెక్ పోస్టు వద్ద వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. దానికి తోడు మెట్ల ద్వారం కూడా మూసేయడంతో భక్తులందరూ కూడా తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.

కాగా ఈ నేపథ్యంలో కొద్దిరోజుల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా మూసేసే అవకాశాలు కూడా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారంగా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ ని నివారించేందుకు తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యులు వెళ్ళడించారు. ఏదేమైనప్పటికీ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంతో ఆశగా వస్తున్నన్నటువంటి భక్తులందరూ కూడా తీవ్రమైన నిరాశతో వెనుదిరుగుతున్నారు.