రిస్క్ చేస్తున్న ప్రభాస్

రిస్క్ చేస్తున్న ప్రభాస్

కరోనా భయంతో మన దేశంలోని సినీ ఇండస్ట్రీలు షూటింగులను నిలిపేసాయి. మన తెలుగు హీరోలు కూడా ఎక్కడివారు అక్కడే షూటింగ్స్ ఆపేసి ఇంట్లో కూర్చున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన 20వ సినిమా షూటింగులో బిజీగా అయిపోతున్నాడు.ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాను చకచకా పూర్తీచేస్తున్నాడు. అయితే ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ పూర్తీ చేసుకొని చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని యూరప్ లో ప్లాన్ చేశారట.అయితే దేశవ్యాప్తంగా డార్లింగ్ అభిమానులు మాత్రం ప్రస్తుతానికి షూటింగ్ ఆపేయాలని కోరారట. ఎందుకంటే కరోనా భయానికి అందరూ షూటింగ్స్ ఆపేస్తుంటే మా ప్రభాస్ మాత్రం షూటింగ్ ప్లాన్ చేసి రిస్క్ తీసుకుంటున్నాడని అభిమానులు భావిస్తున్నారు. .