గోపీచంద్ “భీమా” ట్రైలర్‌ కు డేట్ ఫిక్స్!

గోపీచంద్ “భీమా” ట్రైలర్‌ కు డేట్ ఫిక్స్!
Cinema News

టాలీవుడ్ హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా ఆడియెన్స్ ని అలరించడం లో విఫలం అవుతున్నాడు. అతను తదుపరి భీమా మూవీ లో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ డ్రామాకు ప్రముఖ కన్నడ ఫిల్మ్ మేకర్ అయిన ఎ. హర్ష దర్శకత్వం వహించారు. ఈ మూవీ మార్చి 8, 2024న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ టీజ‌ర్, రెండు సాంగ్స్‌ ను విడుద‌ల చేసింది. వీటికి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గోపీచంద్ “భీమా” ట్రైలర్‌ కు  డేట్ ఫిక్స్!
Bheema Movie

మేకర్స్ ఈ మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ విడుదల కానుందని తాజాగా ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. భీమా మార్చి 8, 2024న బాక్సాఫీస్ వద్ద విశ్వక్సేన్ యొక్క గామితో క్లాష్ కానుంది.