మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?
మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

టాలీవుడ్ యాక్షన్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం భరతవర్ష లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదే కాకుండా, నూతన దర్శకుడు కుమార్ సాయి తో మరో సినిమా కూడా ఆయన లైన్‌లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లో జరగనుండగా, సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

తాజాగా గోపీచంద్ లైనప్‌లో మరో క్రేజీ యాక్షన్ డ్రామా చేరినట్టు టాక్. ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఫుల్ లెంగ్త్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనుండగా, 70 MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం జరగనుంది. సంగీతాన్ని సామ్ సీఎస్ అందించనుండగా, పలువురు టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.

ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం మే 3న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరగనుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే, గోపీచంద్ ఈ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. యాక్షన్ అభిమానులకు ఇది మరో పండగలా మారబోతోంది.