తెలుగు ప్రేక్షకులకు ఆగస్టు 15 అంటే ‘ఖడ్గం’ సినిమాతో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా 90s కిడ్స్కు స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీవీ ఆన్ చేసి ‘ఖడ్గం’ (Khadgam) సినిమా చూడటం ఎన్నో ఏళ్లుగా ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఈ సినిమా చూస్తేనే ఆ రోజు పూర్తైన ఫీలింగ్ వచ్చేదని చాలామంది గుర్తుచేసుకుంటుంటారు.
ఇన్నాళ్లూ ప్రతి ఆగస్టు 15న బుల్లితెరపై సందడి చేసిన ‘ఖడ్గం’ ఇప్పుడు ఈసారి బిగ్ స్క్రీన్పైకి రాబోతోంది. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని థియేటర్లలో రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈసారి టీవీలో కాకుండా థియేటర్లలో భారీ సౌండ్తో ‘ఖడ్గం’ను ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది.
రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. దేశభక్తి, సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్తో మేళవించి తెరకెక్కించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది.

ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే ‘ఖడ్గం’ రీరిలీజ్కు సిద్ధమవుతోంది. మరి బుల్లితెరపై ఏళ్లుగా అలరిస్తున్న ఈ సినిమా బిగ్ స్క్రీన్పై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా సినిమాకు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘ఖడ్గం’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.






