ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రముఖులకు ఆహ్వానం..!

Narendra Modi
Narendra Modi

రేపు ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోటలో జరిగే ప్రత్యక్షంగా పాల్గొనడానికి, గౌరవనీయ ప్రధాన మంత్రి చేసే జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత ప్రసంగాన్ని వినడానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 1800 మంది వ్యక్తులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్బంగా 1800 మంది ప్రత్యేక అతిథుల హాజరవుతున్నారు . ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉపాధ్యాయులు,వైబ్రంట్‌ విలేజ్‌ల సర్పంచులు,రైతులు, నర్సులు, మత్స్యకారులు; సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, హర్‌ఘర్ జల్, అమృత్ సరోవర్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పని చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక ఆహ్వానితుల్లో ఉన్నారు.

దేశవ్యాప్తంగా,50 మందికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న వారికి ఆహ్వానాలు పంపింది. జీవిత భాగస్వాములతో కలిసి ఆగస్టు 15న చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చూసేందుకు న్యూఢిల్లీ కి రావాలని ఆహ్వానాలు పంపింది. వీరిలో, కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా, దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనే, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని వినే అవకాశం కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ ఆహ్వానాలు పంపింది.