దిల్‌రాజు ‘ఎంసీఏ’కు రీ ఎడిటింగ్‌?

Dil-Raju-'makes-changes-in-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘ఎంసీఏ’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఎంసీఏ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. చిత్ర యూనిట్‌ సభ్యులు నాని, భూమిల మద్య సీన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారని భావించి ఆ సీన్స్‌కు ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆ సీన్స్‌ కంటే కూడా అధికంగా నాని, సాయి పల్లవిల మద్య రొమాంటిక్‌ సీన్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ కారణంగానే మొదట చిత్రీకరించి ఎడిటింగ్‌లో తీసేసిన లవ్‌ సీన్స్‌ను ఎడిట్‌ చేయాలని దిల్‌రాజు అండ్‌ టీం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి, నానిల కాంబో సీన్స్‌ను రెండవ వారం నుండి ప్రేక్షకులకు థియేటర్‌లో ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటికే ఎడిటింగ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. భూమిక, నానిల మద్య సీన్స్‌ను కాస్త తగ్గించే యోచనలో కూడా ఉన్నారు. నాని, సాయి పల్లవిల మద్య రొమాంటిక్‌ సీన్స్‌ను చిత్రీకరించి తొలగించారు. ఇప్పుడు వాటిని ఎడిట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ‘ఎంసీఏ’ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేదనే నిరాశలో దిల్‌రాజు ఉన్నాడు. ఆ నిరాశ నుండి ఈ ఆలోచన వచ్చినట్లుగా తెలుస్తోంది. నాని, సాయి పల్లవిల మద్య రొమాంటిక్‌ సీన్స్‌ను పెంచినంత మాత్రాన కలెక్షన్స్‌ పెరుగుతాయా అనేది చూడాలి.